బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) మరో 50 ఏళ్ల పాటు ప్రజల ఆదరాభిమానాలతో బలంగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) మరో 50 ఏళ్ల పాటు ప్రజల ఆదరాభిమానాలతో బలంగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) అన్నారు. బీజేపీ(BJP)లో విలీనం అవుతుందని వాడొకడు, వీడొకడు అంటున్నారని, ఢిల్లీ(Delhi)కి వెళ్లి తాను లాయర్లతో మాట్లాడితే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తాము బీజేపీతో ఒప్పందం పెట్టుకుని ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజుల నుంచి జైలులో ఉండేదా అని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్‌(Congress)నాయకులు ఎవరైనా జైలులో ఉన్నారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ అదృశ్యమైపోవాలని కోరుకునే వాళ్లు చాలామందే ఉన్నారని, 24 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతూ వచ్చిన ఈ పార్టీ మరో 50 ఏళ్ల పాటు బలంగా కొనసాగుతుందని కేటీఆర్‌ చెప్పారు.

ehatv

ehatv

Next Story