ఆస్తి కోసం అయిదు రోజులు ఆసుపత్రిలోనే మృతదేహాన్ని ఉంచారు.

ఆస్తి కోసం అయిదు రోజులు ఆసుపత్రిలోనే మృతదేహాన్ని ఉంచారు. ఈ సంచలన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సదాశివపేట మండలం(Sadhasiva peta) తండేడుపల్లి(Thandedupalli)లో జరిగింది. తమకు చెందాల్సిన ఆస్తి ఇచ్చేంత వరకు భర్త అంత్యక్రియలు జరిపేది లేదని భార్య తెగేసి చెప్పింది. తన భర్త చనిపోలేదని, అత్త మామ, ఆడపడుచు, ఆమె భర్త చంపేశారని ఆరోపించింది. నా భర్త బతికినన్ని రోజులు ఆస్తిలో వాటా కోసమే పోరాడేవాడని తెలిపింది. నా భర్త చివరి కోరిక మేరకే అయిదు రోజుల పాటు అంత్యక్రియలు ఆపాల్సి వచ్చిందని చెప్పింది. 'గతంలోనే మాకు దక్కాల్సిన వాటా కోసం నేను, నా భర్త చనిపోవాలని అనుకున్నాం. భర్త బతికి ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత రెండుసార్లు ఆస్తిలో వాటా ఇస్తామని మోసం చేశారు. ఆడపడచు భర్త మల్లేశం(Mallesam) హోంగార్డు కాబట్టి పోలీసులు అతనికే సపోర్ట్ చేస్తున్నారు' అని భార్య ఆవేదనతో తెలిపింది.

తన భర్త కోరిక మేరకే మృతదేహాన్ని ఇన్ని రోజులు అలాగే ఉంచాల్సి వచ్చిందంది. ఇప్పటికైనా తన భర్తకు చెందాల్సిన ఆస్తిని ఇచ్చేయాలని డిమాండ్‌ చేసింది. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం తన బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18వ తేదీన రాములు(Ramulu) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ehatv

ehatv

Next Story