తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తొలిసారి జనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన.. బహిరంగ సభలో ఎవరిని టార్గెట్ చేస్తారా అని సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ కు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా కేసీఆర్ ఎండగట్టాలని చూస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 12న అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరుకాబోతున్నారు. కేటీఆర్‌ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళ్లనున్నారు. కేసీఆర్‌ మాత్రం హెలికాప్టర్‌ ద్వారా నల్లగొండకు చేరుకుంటారు.. సభ అనంతరం తిరిగి హెలికాప్టర్ లోనే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Updated On 12 Feb 2024 10:51 PM GMT
Yagnik

Yagnik

Next Story