తెలంగాణ(Telangana) ఓ భిన్నమైన ప్రదేశం

తెలంగాణ(Telangana) ఓ భిన్నమైన ప్రదేశం. ఇక్కడ అన్ని మతాల వారు సామరస్యంగా కలిసి మెలిసి ఉంటారు. అందుకే గంగా జమునా తెహజీబ్‌ అంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో హిందూ ముస్లింలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మత పార్టీలు చిచ్చుపెట్టాలని ప్రయత్నించిన ప్రతీసారి మత సామరస్యమే గెలుస్తూ వచ్చింది. ఇక ముందు కూడా గెలుస్తుంది. అసలు విషయానికి వస్తే హైదరాబాద్‌ కూకట్‌పల్లి(Kukatpally) హౌజింగ్‌ బోర్డు కాలనీలో వినాయకుడి మండపాన్ని పెట్టారు. శుక్రవారం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఆనందంగా డాన్సులు చేశారు. ఈ సన్నివేశం చూసి చాలా మంది సంతోషపడ్డారు. ఇది కదా హైదరాబాద్‌ అంటే అని వ్యాఖ్యానించారు.

Eha Tv

Eha Tv

Next Story