జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయం

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలకు మరమ్మతులు చేసేందుకు వారంలోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి అధికారులు ప్రభుత్వం నుంచి సంబంధిత అనుమతులు పొందాలని, ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాలని సూచించారు.
జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్‌ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల సమయంలో ఇరిగేషన్‌ సిబ్బంది అంకితభావంతో పని చేశారని కొనియాడారు. అయితే క్షేత్ర స్థాయిలో తనిఖీల సమయంలో అనేక లోపాలను గుర్తించామని తెలిపారు. ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద రెగ్యులేటర్లు, షట్టర్ల స్థిరమైన పర్యవేక్షణ లేదన్నారు. గేట్లు ఎత్తివేసే క్రమంలో నీటిపారుదల ప్రాజెక్టు షట్టర్ కొట్టుకుపోయిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరిగినా చీఫ్ ఇంజనీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story