మితిమీరిన వేగం ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం నింపింది. కుషాయిగూడ(Kushaiguda) ఈసీఐఎల్ చౌరస్తా(ECIL X Road) వద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్ర‌మాదం చోటుచేసుకుంది.

మితిమీరిన వేగం ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం నింపింది. కుషాయిగూడ(Kushaiguda) ఈసీఐఎల్ చౌరస్తా(ECIL X Road) వద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్ర‌మాదం చోటుచేసుకుంది. మౌలాలి నుంచి పల్సర్ మోటార్ సైకిల్ పై కుషాయిగూడ వైపుగా వస్తున్న ఇద్దరు యువకులు క్రాంతి(33), నరేష్ (23)లు డివైడ‌ర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. క్రాంతి మౌలాలి నివాసి కాగా.. నరేష్ స్వ‌స్థ‌లం జనగామ. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మని చెబుతున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 30 July 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story