జ‌గిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట శివారులో సోమవారం సాయంత్రం నెమళ్లను వేటాడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జ‌గిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట శివారులో సోమవారం సాయంత్రం నెమళ్లను వేటాడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు రైఫిల్‌తో నెమలిని కాల్చి చంపారని స‌మాచారం. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ మాట్లాడుతూ గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన నలువల సత్యనారాయణ, జువ్వాడి రాజులు రైఫిల్‌తో నెమలిని కాల్చి చంపి పక్షితో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పెగడపల్లి పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు.

వారి నుంచి నెమలి కళేబరం, 0.22 స్పోర్టింగ్ రైఫిల్, 34 లైవ్ రౌండ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల‌పై ఐపీసీ సెక్షన్ 429, ఆయుధాల చట్టం-1959లోని సెక్షన్ 25 (1ఎ), వన్యప్రాణుల రక్షణ చట్టం-1972లోని సెక్షన్ 51 (1-ఎ) కింద కేసు నమోదు చేశారు.

Updated On 19 March 2024 8:22 PM GMT
Yagnik

Yagnik

Next Story