తెలంగాణలో కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో(RTC Buses) ఉచిత ప్రయాణ సదుపాయం కలిగించింది. ఉచిత ప్రయాణ సదుపాయం కలిగిస్తూనే బస్సుల సంఖ్యను తగ్గించిందనే విమర్శలు కొందరు చేస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, బస్సుల సంఖ్యను పెంచుతున్నట్టు ఆర్టీసీ(RTC) చెబుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌(Sajjanar) ఓ ప్రకటన చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో(RTC Buses) ఉచిత ప్రయాణ సదుపాయం కలిగించింది. ఉచిత ప్రయాణ సదుపాయం కలిగిస్తూనే బస్సుల సంఖ్యను తగ్గించిందనే విమర్శలు కొందరు చేస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, బస్సుల సంఖ్యను పెంచుతున్నట్టు ఆర్టీసీ(RTC) చెబుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌(Sajjanar) ఓ ప్రకటన చేశారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అయితే అది మరోలా ఉంటోందని చెప్పారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ప్రయాణిస్తున్నట్టు టీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్‌ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు(Palle velugu) బస్సులలో ఎక్కి, సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ కోరారు.
మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పారు సజ్జనార్‌. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated On 23 Dec 2023 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story