ప్రతి ఏడాది హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగరంలో(Hussen sagar) వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంటుంది.

ప్రతి ఏడాది హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగరంలో(Hussen sagar) వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంటుంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను చూసేందుకు తరలి వస్తారు. చతుర్దశి రోజు హైదరాబాద్‌ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంటుంది. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తయిన విగ్రహంతో పాటు గల్లీలలోని మండపాలలో పెట్టిన గణపతులు కూడా హుస్సేన్‌సాగర్‌వైపుకు కదిలివెళుతుంటారు. అయితే ఈసారి ఆ అవకాశం లేదు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు అధికారులు అనుమతించడం లేదు. ఇందుకోసమే ట్యాంక్‌బండ్‌(Tankbund) మార్గంలో భారీగా ఇనుప కంచెలను(fencing) ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు(High court) ఆదేశాల మేరకు విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వడం లేదని అందులో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు పెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌తో (POP) తయారుచేసిన విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడంలేదని లాయర్‌ వేణుమాధవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూస్తున్నదని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Eha Tv

Eha Tv

Next Story