అలంపూర్‌లో పోటీకి సై అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు.. మూడుసార్లు గెలిచిన బీజేపీకి జై కొడుతారా..జోగులాంబ సన్నిధిలో ఈసారి పొలిటికల్‌ జోరెవరిది? అలంపూర్‌లో అబ్రహం మళ్లీ గెలుస్తారా? ఎమ్మెల్యేగారి పనితీరు.. ప్రజలకు పసందేనా? శ్రీశైలం పశ్చిమ ద్వారంలో ప్రతిపక్షాల వ్యూహమేంటి? శక్తి పీఠంలో ప్రతిపక్షాలకు ఛాన్స్‌ దొరుకుతుందా?

అలంపూర్‌లో(Alampur Constituency) పోటీకి సై అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు.. మూడుసార్లు గెలిచిన బీజేపీకి జై కొడుతారా..జోగులాంబ సన్నిధిలో ఈసారి పొలిటికల్‌ జోరెవరిది? అలంపూర్‌లో అబ్రహం మళ్లీ గెలుస్తారా? ఎమ్మెల్యేగారి పనితీరు.. ప్రజలకు పసందేనా? శ్రీశైలం పశ్చిమ ద్వారంలో ప్రతిపక్షాల వ్యూహమేంటి? శక్తి పీఠంలో ప్రతిపక్షాలకు ఛాన్స్‌ దొరుకుతుందా?

అలంపూర్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండి..రాయలసీమ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉండే నియోజకవర్గం అది. తుంగభద్ర నదీ తీరాన ఉండి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలంపూర్ నియోజకవర్గం రాజకీయంగా తనదైన శైలీలో ముద్ర వేసుకుంది. జిల్లాలోనే వెనుక బడిన ప్రాంతంగా ముద్రపడినా..అలంపూర్ నియోజకవర్గం ప్రతీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజల తీర్పు చైతన్యవంతంగా ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో.. ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది. తుంగభద్ర నది ఒడ్డున ఉంటూ.. శ్రీశైలం పశ్చిమ ద్వారంగా ప్రసిద్ధికెక్కిన ఈ జోగులాంబ క్షేత్రంలో… రాజకీయం మరోసారి రసపట్టుగా మారింది. 18 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రంలో.. ఈసారి పొలిటికల్‌ జోరెవరిదనే విషయంలో… రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్(Mahaboob nagar) జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో అలంపూర్ ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి.
అలంపూర్,ఐజ,ఇటిక్యాల,వడ్డేపల్లి,మానోపాడు మండలాలు ఇక్కడ చాలా కీలకం. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని… తెలంగాణలో ఉండే అలపూర్ నియోజకవర్గంలో రాజకీయం ప్రత్యేకమైంది. 1957 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఐదు సార్లు గెలిస్తే… బిజెపి మూడు సార్లు, టిడిపి రెండు సార్లు, ఇండిపెండెంట్ ఒక సారి, టిఆర్ఎస్ ఒక సారి.. విజయం సాధించాయి.

నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ తరపున అబ్రహం(Abraham) తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ(TDP) అభ్యర్థి ప్రసన్న కుమార్(Prasanna Kumar) పై 1194 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టకి చెందిన సంపత్ కుమార్(Sampath) చేతిలో ఒటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అబ్రహంపై 6839 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల తర్వాత అబ్రహం గులాబీ(BRS) కండువా కప్పేసుకున్నారు.
ఉద్యమకాలం నుంచీ ప్రయత్నిస్తే… రాష్ట్ర ఏర్పాటు తర్వాత, అంటే 2018ఎన్నికల్లో కారుపార్టీని విజయం వరించింది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన అలంపూర్‌లో… టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వి.ఎం. అబ్రహం గెలుపు ను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ పై 44 వేల 679 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఒక రికార్డు సృష్టించారు. అయితే, మరోసారి ఆయనకు ప్రజలు అవకాశం ఇస్తారా? అంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సంపత్‌కుమార్‌… ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. సందు దొరికితే చాలు… ఎమ్మెల్యే ఇరుకునపెట్టేలా విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మునుపటి కంటే ఈసారి కాంగ్రెస్‌లో జోష్‌ కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి… విజయావకశాల్ని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు సంపత్‌.

బీజేపీ(BJP) సైతం… ఈసారి అలంపూర్‌ను సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచిన ఆ పార్టీ… ఇప్పుడున్న వేవ్‌లో మళ్లోసారి ఈజీగా గెలవొచ్చన్న ధీమాతో ఉంది. ఈ స్థానంలో గెలుపు రుచి తెలిసిందే కాబట్టి… మరోసారి ఆ ఫ్లేవర్‌ను ఎంజాయ్‌ చేయాలన్న కసితో పనిచేస్తున్నారు లోకల్‌ నేతలు. అభ్యర్థి ఎవరనే విషయంలో క్లారిటీ రాకపోయినా.. క్యాడర్‌లో జోష్‌ తగ్గకుండా చూసుకుంటున్నారు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు.

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్‌ వీఎం అబ్రహం ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కుమారుడు అజయ్‌ని(Ajay) ఈసారి బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినబడుతోంది. అందుకే, నియోజకవర్గ రాజకీయాల్లో అతణ్ని క్రియాశీలం చేశారనే ముచ్చట.. లోకల్‌గా షికారు చేస్తోంది. అంతేకాదు, పార్టీ కార్యక్ర మాల్లోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు అబ్రహం కొడుకు. అయితే, ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం కోసం ఆశపడుతున్న వారికి.. ఈ వ్యవహారం ఇబ్బందిగా మారిందట. కానీ ఆశావహుల సందడి ఎక్కువగా కనిపిస్తుండటం.. అధికార పార్టీలో ఆందోళన పెంచుతోంది. అబ్రహం, ఆయన కుమారుడితో పాటు… మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీచైర్మన్‌ బండారు భాస్కర్‌తోపాటు మరికొందరు నేతలు… ఈ సీటును ఆశిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ అంతర్గత పోరుతో… ఎమ్మెల్యే అబ్రహమ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్న ప్రచారమూ ఊపందుకుంది.

రాజకీయాలు అట్టా ఉంటే… నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చ మరోలా నడుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న అలంపూర్.. ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్‌మెంట్‌ను చూస్తున్నా… అదేస్థాయిలో సమస్యలూ వెంటాడుతున్నాయి.ప్రసిద్ధి గాంచిన జోగులాంబ ఆలయం దగ్గర సౌకర్యాలలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది భక్తుల ప్రధాన ఆరోపణ. ఆలయంలో పందులు తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమంటున్నారు.ఓవైపు అధికార పక్షం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశామలం చేశామని చెబుతుంటే.. విపక్షనేతల వెర్షన్‌ మరోలా ఉంది. ఆర్డీఎస్ కెనాల్ నిరూపయోగంగా ఉందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. తుమ్మిళ్ల నుంచి కూడా… అరాకొర నీళ్లు మాత్రమే పారుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇక అలంపూర్ నియోజకవర్గం నేతలకు సమస్యలతో స్వాగతం పలుకుతోంది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ పనిచేయకపోవడంతో… లోకల్‌ జనాల అవస్థలు అన్నీ ఇన్నీకావు. ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిలయ్యారంటోంది విపక్షం. అబ్రహం రాకముందు అలంపూర్‌ ఎలా ఉండేది?… ఇప్పుడెలా ఉంది? అంటే మాత్రం… పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందనేవారు ఎక్కువే ఉన్నారు. రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆర్డీఎస్ సప్లమెంటరీ తీసుకొచ్చి సాగునీరందించారనీ… 24, 25 డిస్ట్రిబ్యూటరీల దగ్గర, గతంలో అర ఫీట్‌ వాటర్‌ మాత్రమే నిల్వ ఉండేవనీ… ఇప్పుడు ఆరు ఫీట్ల వరకు నీళ్లు నిల్వ ఉండేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారనీ స్థానికంగా పలువురు అభిప్రాయపడ్డారు.

విద్య, వైద్యం, రవాణా విషయంలో… గతంతో పోలిస్తే అలంపూర్‌లో బెటర్మెంట్‌ ఉందన్నది ఎమ్మెల్యే మాట. అందులోనూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు కూడా అబ్రహమ్‌కు ఉండటం కలిసొచ్చే అంశం. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చానంటున్నారు ఎమ్మెల్యే అబ్రహం. అభివృద్ధికి తోడు కేసీఆర్‌ సంక్షేమ పథకాలు.. తన విజయానికి అదనపు బలంగా ఉపయోగపడతాయని ధీమాగా చెబుతున్నారు. మరిన్ని పనులు చేయాల్సి ఉందని… అందుకే మరోసారి గెలిచి వస్తానంటున్నారు. ఎన్నికల ఏడాది వచ్చేయడంతో… అలంపూర్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. క్రమక్రమంగా పొలిటికల్‌ ఈక్వెషన్స్‌ కూడా మారుతున్నాయి.

మరోవైపు అలంపూర్ నియోజకవర్గం‌ అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. . టిఆర్ఎస్ నేతల మధ్య గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం వర్గీయులు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​ వర్గీయులపై ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడులు నేపథ్యంలో జరిగిన సాయి చందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతని అనుచరులు అలంపూర్ నియోజకవర్గంలో పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చింపేసారు. అయితే ఇది ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తూ సాయిచంద్ మిత్రమండలి ఆగ్రహంతో ఉన్నారు. ఈ గొడవ ఎంతవరకు వెళుతుందోననే ఆందోళన టిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతుంది.

అంతకముందు ఆలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే అబ్రహం, సాయి చంద్​ వర్గీయులు బాహాబాహీకి దిగిన ఘటనలు ఉన్నాయి. తమకు పోటీగా మరొక టిఆర్ఎస్ నాయకుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకున్నారు. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ సమైక్యత కార్యక్రమంలో అతిథిగా హాజరైన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​ వర్గీయులు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కార్యకర్తలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. జాతీయ సమైక్యత కార్యక్రమంలో సాయి చందుకు ఆహ్వానం లేకున్నా కార్యక్రమానికి ఎందుకు వచ్చాడని ఎమ్మెల్యే అబ్రహం వర్గం వారు సాయి చంద్​ వర్గాన్ని ప్రశ్నించారు.

ఈ క్రమంలో మాటామాటా పెరిగి స్టేజ్ పైనే ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​ గన్‌మెన్‌కు, పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అలంపూర్ నియోజకవర్గం అధికార టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా రాజకీయ విభేదాలు బయటపడ్డాయి.
గత కొంతకాలంగా సాయి చందు ఆలంపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచి టీఆర్ఎస్ తరుపున సాయిచందు పోటీలో ఉంటారని అతని అనుచరులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే సాయి చంద్​ పర్యటన నిర్వహించడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటివి చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఈ క్రమంలో తమకి ఎక్కడ పోటీగా వస్తాడని ఆందోళన ఎమ్మెల్యే అబ్రహం వర్గీయుల్లో నెలకొంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే అబ్రహం కార్యకర్తలు జాతీయ సమైక్యత కార్యక్రమంలో ఒక్కసారిగా సాయి చందు అనుచరులపై దాడులకు తెగబడినట్లు తెలిసింది. ఎలాంటి ఆహ్వానం లేకుండా జాతీయ సమైక్యత కార్యక్రమానికి ఎందుకు వచ్చారని ఫిర్యాదులు కూడా చేసినట్టుగా పార్టీలో చర్చలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంఘటనలతో అలంపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి వచ్చే ఎన్నికల నాటి వరకు బాహబాహీగా తలపడతారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్

సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం మళ్లీ గెలుస్తారా? లేదా? ప్రతిపక్షాలకు ఈసారైనా చాన్స్‌ దక్కుతుందా? లేదా? అంటూ బోలెడన్ని ముచ్చట్లు గుసగుసలుగా గుప్పుమంటున్నాయి.

ఎమ్మెల్యే ఎత్తుకున్న అభివృద్ధి మంత్రి.. సంక్షేమరాగం… వచ్చే ఎన్నికల్లో సహకరిస్తాయా? కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌ గెలుస్తుందా? లేక బీజేపీ తన బలం చూపిస్తుందా? అన్నది చూడాలి.

Updated On 5 Nov 2023 6:02 AM GMT
Ehatv

Ehatv

Next Story