మునుగోడు(Munugode) ఉప ఎన్నికలతో(By-Elections) రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. ఒక్క ఏడాదిలో రెండుసార్లు ఎన్నిక జరిగిన నియోజవర్గం మునుగోడు మాత్రమే. ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్‌ఎస్ మళ్లీ జెండా ఎగరేస్తుందా? ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? క్రాస్ ఓటింగ్‌తో నష్టపోయిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నుంచి జంప్ చేసి ఉప ఎన్నికలకు కారణమైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? రాజగోపాల్‌ మళ్లీ కమలం అభ్యర్థేనా? రానున్న ఎన్నికల్లో మునుగోడులో కనిపించే సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

మునుగోడు(Munugode) ఉప ఎన్నికలతో(By-Elections) రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. ఒక్క ఏడాదిలో రెండుసార్లు ఎన్నిక జరిగిన నియోజవర్గం మునుగోడు మాత్రమే. ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్‌ఎస్ మళ్లీ జెండా ఎగరేస్తుందా? ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? క్రాస్ ఓటింగ్‌తో నష్టపోయిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నుంచి జంప్ చేసి ఉప ఎన్నికలకు కారణమైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? రాజగోపాల్‌ మళ్లీ కమలం అభ్యర్థేనా? రానున్న ఎన్నికల్లో మునుగోడులో కనిపించే సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

మునుగోడు నియోజకవర్గంలో(Munugode Constituency) మొత్తం 7 మండలాలు ఉన్నాయి. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్, చౌటుప్పల్, నారాయణపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మునుగోడు అసెంబ్లీకి తొలిసారిగా 1967లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్(Congress), ఐదుసార్లు సీపీఐ, రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, వామపక్షాలకు సమానంగా ఆదరిస్తోంది. గతంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ జరిగే మునుగోడులో బీఆర్‌ఎస్(BRS) ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి(Palvai Govardhan Reddy) ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో(BJP) చేరారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఎన్నికలు ర‌స‌వ‌త్తరంగా జరిగేలా కనిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరు.. మళ్లీ పునరావృతమయ్యేలా ఉందని అంటున్నారు. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్ మండలాల్లో సీపీఎం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో సీపీఐ ప్రభావం చూపుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల 367 ఓటర్లు ఉండగా, పురుషులు లక్ష 21 వేల 501 మంది, మహిళలు లక్ష19 వేల 859 మంది ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(Kusukuntla Prabhakar Reddy) ఆరు నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటానన్న ప్రకటించిన మంత్రి కేటీఆర్ యోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే ఉమ్మడి జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మునుగోడు. దీంతో బైపోల్ లో బీసీలకే టికెట్లు ఇవ్వాలని కుల సంఘాలు మొదటి నుంచీ డిమాండ్ చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి కైలాష్, చెరుకు సుధాకర్ లాంటి నేతలు ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఉపఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తమ పార్టీ నేత బీజేపీలోకి వెళ్లడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న కాంగ్రెస్.. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమే పోటీ ఉంటుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్.. పరిస్థితిని మరింత దిగజార్చుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతి ఉన్నప్పటికీ.. తాను కూడా నియోజకవర్గ ఇన్‌చార్జినేనని ప్రముఖ కాంట్రాక్టర్ చల్లమల్ల కృష్ణారెడ్డి చెప్పుకుంటున్నారు. ఏదైనా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ ఇచ్చిన బీజేపీ బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతోనే నియోజకవర్గంలో బీజేపీ బలపడింది. అయితే ఉపఎన్నికల్లో ఇచ్చిన పోటీ.. సాధారణ ఎన్నికల్లో ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ప్రభావం అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ సారి మునుగోడు కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయకపోవచ్చన్న ప్రచారం జరుగుతుండటం బీజేపీ కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. అయితే ఇవన్నీ తన వ్యతిరేకుల ప్రచారమని.. మునుగోడు నుంచే రాజగోపాల్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాన పార్టీలు ఆశలు భారీగా ఉండగా, కమ్యూనిస్టుల పొత్తుల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. 2014 వరకు కాంగ్రెస్‎లో పోటీపడిన కమ్యూనిస్టులు ఆరు నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్ మండలాల్లో సీపీఎం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంది. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరులలో సీపీఐ ప్రభావం చూపుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే.. ఇక్కడి నుంచి పోటీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం భావించారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి.

ఇలా మునుగోడు రాజకీయం రసకందాయంగా కనిపిస్తోంది. గత నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్‌ఎస్‌లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్‌తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది. వామపక్షాలు మాత్రం కుదిరితే పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని.. లేదంటే తమతో పొత్తు పెట్టుకునేవారిని గెలిపించాలని ఉవ్వాళ్లూరుతున్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లు ఈ సారి ఎవరికి చాన్స్ ఇస్తారనేది మాత్రం సస్పెన్స్‌గానే మారింది.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story