మంగళవారం బంజారాహిల్స్‌లోని నంది నగర్ ప్రాంతంలోని భారత రాష్ట్ర సమితి

మంగళవారం బంజారాహిల్స్‌లోని నంది నగర్ ప్రాంతంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంటి దగ్గర చేతబడి లేదా క్షుద్ర పూజలు చేశారనే భయం ప్రజలను వెంటాడుతూ ఉంది. అలాంటి పూజలకు సంబంధించిన కొన్ని వస్తువులను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతంలోని ప్రజలు కేసీఆర్ నివాసం పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో నిమ్మకాయలు, బొమ్మ, పసుపు.. ఇతర సామాగ్రిని గుర్తించారు. వీటిని సాధారణంగా చేతబడి చేయడానికి ఉపయోగించేవారని నమ్ముతున్నారు. సమాచారం అందడంతో స్థానిక పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఎవరు ఈ పని చేశారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

పోలీసులు చెబుతోంది ఇదే:

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు జరిగాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని పోలీసులు తెలిపారు. కొంతమంది పిల్లలు రీల్స్ కోసం ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా బొమ్మలు తయారు చేశారని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛ నీయమైన సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు.

Updated On 16 April 2024 6:20 AM GMT
Yagnik

Yagnik

Next Story