సీఎల్పీ నేత(CLP Leader) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(Peoples March Padayatra)లో భాగంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) రేపు సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. జడ్చర్ల(Jadcherla)లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ

సీఎల్పీ నేత(CLP Leader) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(Peoples March Padayatra)లో భాగంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) రేపు సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. జడ్చర్ల(Jadcherla)లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పీపుల్స్ మార్చ్ బహిరంగ సభను ఏర్పాటు చేసిన‌ట్లు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(mahesh kumar goud)తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు బ‌హిరంగ స‌భ ప్రారంభ‌మ‌వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. బ‌హిరంగ సభా వేదిక‌కు రాజీవ్ గాంధీ ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిధిగా హిమాచల్ ప్రదేశ్ సీఎం(Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుఖ్(Sukhvinder Singh Sukhu) పాల్గొన‌నున్నారు. అలాగే.. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manikrao Thakre), పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఇతర సీనియర్ నాయకులు స‌భ‌లో పాల్గొననున్నారు. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు సభలో పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్‌ కోరారు.

Updated On 24 May 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story