ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయ‌న బుధ‌వారం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని.. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. తాజాగా మరో దోపిడీకి తెర తీశారు.

ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయ‌న బుధ‌వారం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని.. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. తాజాగా మరో దోపిడీకి తెర తీశారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. రూ.7,388 కోట్లలో 738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలి. చెల్లించాల్సిన 10శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

లక్ష కోట్ల ఆస్తిని రూ.7,388 కోట్లకే కొల్లగొట్టిన కంపెనీ రూ.738 కోట్లు చెల్లించాలి. హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. హెచ్ జీ సీఎల్ ఎండీగా హడావుడిగా బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని అన్నారు. ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారి ఉండాల్సిన పదవిని రిటైర్ అధికారికి ఎందుకు అప్పజెప్పారని అనుమానం వ్య‌క్తం చేశారు.

ఐఆర్‌బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49శాతం వాటా అమ్మేసింది. తేజరాజు, రాజేష్ రాజు, కేటీఆర్ సింగపూర్ వెళ్ళినపుడు ఎక్కడ ఉన్నారు.? అని ప్ర‌శ్నించారు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నార‌ని.. అందుకే కేటీఆర్ గూడుపుఠానీ సమావేశాలని ఆరోపించారు.

ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చింది. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయి. షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు ఎవరో.. యువరాజులు ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 లోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10శాతం నిధులు చెల్లించాలని.. లేకపొతే సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలన్నారు. అరవింద్ కుమార్ నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు. ఆయన కేవలం కేసీఆర్, కేటీఆర్ కు మాత్రమే తాబేధారా.? అని ప్ర‌శ్నించారు.

నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. మజెల్స్ సంస్థ నివేదిక తప్పు అని తేలింది కదా.. 10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే.. హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ కార్యాలయాలు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తామ‌న్నారు. జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్ సంస్థలకు పిర్యాదు చేస్తామ‌న్నారు. ఇంత దారిదోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేయరని ప్ర‌శ్నించారు. బండి సంజయ్ ఓఆర్ఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు.

Updated On 24 May 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story