సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు అమెరికాలో బాత్రూంలు కడుగుతున్న కేటీఆర్ ఏం తెలుసు నీకు అంటూ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఎన్ని అడ్డంకులున్నా పార్లమెంట్ లో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు.

సోనియ(Sonia)మ్మ తెలంగాణ(Telangana) ఇచ్చిన రోజు అమెరికా(America)లో బాత్రూంలు కడుగుతున్న కేటీఆర్(KTR) ఏం తెలుసు నీకు అంటూ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఎన్ని అడ్డంకులున్నా పార్లమెంట్ లో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్(Congress) అని తెలిపారు. అమెరికా నుంచి దుబాయ్(Dubai) వెళ్లి వచ్చిన కేటీఆర్.. నిషా దిగినట్టు లేదని ఎద్దేవా చేశారు. కేవీపీ(KVP)తో చీకట్లో కలిసింది మీ అయ్యనే అన్నారు. కేవీపీ చెప్పార‌ని కొంతమంది అధికారులను నియమించుకున్నారు. మీరు మీరు చీకట్లో పంచుకుని నా వెనక కేవీపీ ఉన్నారని మాట్లాడుతారా? అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల దగ్గర తాకట్టు పెట్టింది మీరు.. మీరా నా గురించి మాట్లాడేది.? అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నువ్వు మీ అయ్యా నా ఎడమకాలి చెప్పుకు కూడా సరిపోరని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సమైక్యవాదులతో అంతకాగుతోంది మీరు అని మండిప‌డ్డారు. అమరవీరుల స్థాపం ప్రారంభించి వంద రోజులు కాకముందే పగుళ్లు పట్టాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా చిత్తశుద్ధిని శంకించేదని ఫైర్ అయ్యారు.

తెలంగాణ కోసం నేను కొట్లాడిన అనడానికి మాజీ గవర్నర్ నరసింహన్(Narasimhan) సజీవ సాక్ష్యం అని అన్నారు. తెలంగాణను ఈ తండ్రీ కొడుకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారని.. తెలంగాణ సంపదను ఈ తండ్రీ కొడుకులు కొల్లగొడుతున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీలో కూడా తెలంగాణ పేరును తొలగించిన ద్రోహులు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

Updated On 13 Sep 2023 8:29 PM GMT
Yagnik

Yagnik

Next Story