పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని.. ఇందుకు కర్ణాటకలో(Karnataka) మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే(Bosuraju) ఉదాహరణ అని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో(Gandhi bhavan) పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. సమావేశంలో నాలుగు తీర్మానాలు చేసిన‌ట్టు పేర్కొన్నారు.

పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని.. ఇందుకు కర్ణాటకలో(Karnataka) మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే(Bosuraju) ఉదాహరణ అని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో(Gandhi bhavan) పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. సమావేశంలో నాలుగు తీర్మానాలు చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఏఐసీసీ(AICC) సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్(Nadeem Javed) లను అభినందిస్తూ.. కొత్తగా నియమితులైన సెక్రెటరీలను అభినందిస్తూ.. బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని.. సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా అభినందిస్తూ తీర్మానాలు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీలు వారు ఇంఛార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 15 రోజులకు ఒక నివేదిక(Report) పంపాలని ఆదేశించారు. ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలని నేత‌ల‌ను కోరారు. పనితనం ఆధారంగానే.. సర్వేల ప్రాతిపదికన టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఘంటాప‌థంగా చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు.

Updated On 10 Jun 2023 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story