నాగార్జునసాగర్ డ్యామ్‌కు(Nagarjuna Sagar Dam) ఏపీ పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు(AP Officials) రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ‌ వాతావరణం నెల‌కొంది. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Redy) స్పందించారు.

నాగార్జునసాగర్ డ్యామ్‌కు(Nagarjuna Sagar Dam) ఏపీ పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు(AP Officials) రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ‌ వాతావరణం నెల‌కొంది. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Redy) స్పందించారు.

పోలింగ్ రోజు(Polling) ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్(KCR) ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమేన‌న్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామ‌న్నారు.

దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంతున్నాం.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా అని ప్ర‌శ్నించారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవన్నారు. కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలేన‌న్నారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదు.. వివాదాలకు సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది భ‌రోసా ఇచ్చారు.

Updated On 29 Nov 2023 11:22 PM GMT
Ehatv

Ehatv

Next Story