రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది . . అతివేగంతో అదుపుతప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి . ఎల్లారెడ్డి పేట మండలం నుంచి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయల్ధేరారు రేవంత్ రెడ్డి . తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి . ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలున్లు ఓపెన్ కావడంతో […]

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది . . అతివేగంతో అదుపుతప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి . ఎల్లారెడ్డి పేట మండలం నుంచి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయల్ధేరారు రేవంత్ రెడ్డి . తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి . ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలున్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. కార్ల ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి . ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఏలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు . కానీ కాన్వాయ్ లోని ఓ కారులో ప్రయాణిస్తున్న మీడియా ప్రతినిధులకు గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం .

Updated On 4 March 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story