జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్(KCR) ఆ హామీని తుంగలో తొక్కారని.. పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ కు చీము నెత్తురు ఉంటే.. 3 గంటల కరెంటు ఇస్తామన్నామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందో నిరూపించాల‌న్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది అని అన్నారు.

రైతులు, మహిళలు, నిరుద్యోగులు స‌హా అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంద‌ని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఆలంపూర్(Alampur) స‌భలో ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి సంపత్(Sampath) హయాంలో జరిగిందే.. తుమ్మిళ్లను కట్టే వరకు కొట్లాడింది సంపత్ అని వెల్ల‌డించారు.

జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్(KCR) ఆ హామీని తుంగలో తొక్కారని.. పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ కు చీము నెత్తురు ఉంటే.. 3 గంటల కరెంటు ఇస్తామన్నామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందో నిరూపించాల‌న్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది అని అన్నారు.

24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతుండు.. నేను సూటిగా సవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం. నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్ నామినేషన్ వేయమ‌న్నారు. లేకపోతే నడిగడ్డలో మీరు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా.? అని ప్ర‌శ్నించారు. దొరగారి దొడ్లో జీతగాడిగా బతకడమేనా వెంకట్ రామిరెడ్డి ఆత్మగౌరవం.. ఇదేనా నడిగడ్డ పౌరుషం... ఒకసారి ఆలోచించాలని కోరారు.

మీ బిడ్డగా చెబుతున్నా అధికారంలోకి రాగానే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామ‌న్నారు. నల్లమల్ల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాదన్నారు. ఇది మన పాలమూరు(Palamuru) బిడ్డల జీవన్మరణ సమస్య.. ఆత్మగౌరవ సమస్య.. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్(Harish Rao) కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను చంపేందుకు భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.

ధరణి లేకపోయినా వైఎస్ హయాంలో రైతులకు ఆర్ధిక సాయం అందలేదా? అని ప‌శ్నించారు. ధరణి స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్ తీసుకోస్తాం.. రైతుల భూములు కాపాడుతామ‌న్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు.

Updated On 7 Nov 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story