నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించిన కేసీఆర్(KCR) మళ్లీ మూడోసారి అధికారం కోసం మీ ముందుకు వస్తున్నార‌ని.. రైతు రాజ్యం అని చెప్పి రైతును నట్టేట ముంచిన కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న కేసీఆర్..

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించిన కేసీఆర్(KCR) మళ్లీ మూడోసారి అధికారం కోసం మీ ముందుకు వస్తున్నార‌ని.. రైతు రాజ్యం అని చెప్పి రైతును నట్టేట ముంచిన కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న కేసీఆర్.. సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్(Congress) కాదా.? అని ప్ర‌శ్నించారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునేవారని అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) అని కొనియాడారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని(Rahul gandhi) ఎవరు అని సన్నాసి కేటీఆర్(KTR) ప్రశ్నిస్తుండని ఫైర్ అయ్యారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? అని మండిప‌డ్డారు.

తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిందన్నారు. తెలంగాణలో ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామ‌న్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్ధిక సాయం చేస్తామ‌న్నారు, రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామ‌న్నారు. రైతు కూలీలకు రూ.12వేలు.. పెన్షన్ రూ.4వేలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. విజయరమణారావును 50వేల మెజారిటీతో గెలిపించండని.. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాదని పిలుపునిచ్చారు.

Updated On 19 Oct 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story