హాషామాబాద్ షాదన్ హోటల్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది

హైదరాబాద్(Hyderabad) మహానగర పరిధి సైదాబాద్(Cyderabad), శంకేశ్వర్‌ బజార్, సాయిరాం కాలనీకి చెందిన సందీప్(20), అభిలాష్(20), శ్రీహరి(20) ప్రాణ స్నేహితులు. అభిలాష్ సోదరి అమరావతి రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అత్తారింట్లో నివసిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె మామకు సోమవారం శస్త్ర చికిత్స జరగాల్సి ఉండటంతో భర్త సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న తనకు తోడుగా రావాలని ఆమె తమ్ముడిని అడగడంతో అభిలాష్ ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై శివరాంపల్లికి బయలుదేరాడు. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ(Bandlaguda) వైపు వెళుతుండగా హాషామాబాద్ షాదన్ హోటల్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో అభిలాష్, సందీప్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలైన శ్రీహరిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అందివచ్చిన కొడుకులు పోగొట్టుకొని మృతుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story