గ్రూప్‌-1 మెయిన్స్‌కు(Group-1 mains) తెలంగాణ హైకోర్టు(High court) పచ్చ జెండా ఊపింది.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు(Group-1 mains) తెలంగాణ హైకోర్టు(High court) పచ్చ జెండా ఊపింది. ప్రిలిమ్స్‌పై(Prelims) దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దాంతో ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు డిస్మిస్‌ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 31,382 మంది అభ్యర్థులు రాయనున్న మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story