ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల వేడుకల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఆదివారం ప్రత్యేక బస్సులను నడుపనుంది.

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల వేడుకల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఆదివారం ప్రత్యేక బస్సులను నడుపనుంది. టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రకారం.. నగరవ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ 175 బస్సులను నడుపుతున్న‌ట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్‌చెరు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, ఓల్డ్ బోయిన్‌పల్లి నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుతాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

Eha Tv

Eha Tv

Next Story