ఒక మహిళ తనను కాటు వేసిన పామును చంపి, తనతో పాటు ఆసుపత్రికి తీసుకుని

ఒక మహిళ తనను కాటు వేసిన పామును చంపి, తనతో పాటు ఆసుపత్రికి తీసుకుని వచ్చింది. ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె పామును వాటర్ బాటిల్ లో తీసుకుని రావడంతో అందరూ షాకయ్యారు. వెంకటాపురం నూగూరు మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మను పాము కాటేసింది. ఆమె వేగంగా స్పందించి పామును చంపగలిగింది. అయితే, దాన్ని పారేయకుండా తనతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

చనిపోయిన పామును ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్టుకుని వైద్య సహాయం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. తనను కాటేసిన పామును గుర్తించి అవసరమైన వైద్యం అందించాలని వైద్యులను కోరింది. వైద్యులు పాముని చూసి అది విషపూరితమైనదని నిర్ధారించారు. పాము కాటుకు ఆమెకు సత్వర చికిత్స అందించారు. ప్రస్తుతం శాంతమ్మ కోలుకుంటూ ఉంది.

Updated On 16 April 2024 10:03 PM GMT
Yagnik

Yagnik

Next Story