తెలంగాణ మంత్రి సీత‌క్క రేపు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. పెసా చ‌ట్టంపై జ‌రిగే జాతీయ స‌ద‌స్సుల్లో మంత్రి సీత‌క్క‌ పాల్గోనున్నారు.

తెలంగాణ మంత్రి సీత‌క్క రేపు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. పెసా చ‌ట్టంపై జ‌రిగే జాతీయ స‌ద‌స్సుల్లో మంత్రి సీత‌క్క‌ పాల్గోనున్నారు. గురువారం నాడు పెసా చ‌ట్టంపై ఢిల్లీ కేంద్రంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆద్వ‌ర్యంలో జాతీయ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. న్యూ ఢిల్లీలోని డా. అంబేద్క‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్‌లో పెసా చ‌ట్టం అమ‌లు, ఎదుర‌వుతున్న స‌వాళ్లపై చ‌ర్చ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గోనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున స‌ద‌స్సుకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క‌ హ‌జ‌ర‌వుతున్నారు. ఆదివాసీ, గిరిజ‌నుల అభివృద్ది, పెసా చ‌ట్ట అమ‌ల్లో ఎదుర‌వుతున్న ఇబ్బందులు, ప‌రిష్కార మార్గాల‌పై మంత్రి సీత‌క్క‌ ప్ర‌సంగించ‌నున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story