2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా వ్యవహరిస్తోంది. వివక్షాపూరిత చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇదే విధంగా ఆలోచిస్తే ఇక్కడ అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలకు నిధులు ఇవ్వకుంటే మీరేం చేస్తారు? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిరుగుబాటు చేసినట్లే.. మీపై కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపి 8 సీట్లు గెలుచుకుంది. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (సిర్పూర్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), ఆలేటి మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), రామారావు పటేల్ (ముధోల్‌), పైడి రాకేష్ రెడ్డి (ఆర్మూర్), కె వెంకట రమణా రెడ్డి (కామారెడ్డి), ధనపాల్ సూర్యనార్య గుప్తా (నిజామాబాద్ అర్బన్), టి రాజా సింగ్ (గోషామహల్) ఈ సారి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.

Eha Tv

Eha Tv

Next Story