హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు(Zero current bill) రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో రేషన్‌కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహ జ్యోతి వర్తించనుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలు(Bill machines) కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు(Zero current bill) రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో రేషన్‌కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహ జ్యోతి వర్తించనుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలు(Bill machines) కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా సున్నా బిల్లులు జారీ చేసి చూశారు. అంత సక్రమంగా ఉన్నట్లు ఇంజినీర్లు నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 1వ తేదీ శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. నగరం లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 48.06 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రజా పాలనలో జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి గృహ జ్యోతికి 19.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డు(Ration Card) ఉన్న వారికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రకటించడంతో.. ఇప్పటివరకు 11 లక్షల మందే ఈ పథకానికి అర్హులుగా తేలారు. అర్హత ఉండి సున్నా బిల్లు రాకపోతే మాత్రం మున్సిపల్‌, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ప్రతి నెలా ఇచ్చిన మాదిరే మీటర్‌ రీడర్‌, సిబ్బంది వినియోగదారుడు ఇంటికి వచ్చి రీడింగ్‌ నమోదు చేస్తారు. మొత్తం వాడిన యూనిట్లు, అందుకయ్యే ఛార్జీ, సేవా రుసుములు, విద్యుత్తు సుంకం వంటి వివరాలన్ని ఎప్పటిలాగే నమోదు చేస్తారు. 200 యూనిట్ల లోపు అయితే గృహ జ్యోతి సబ్సిడీ ఎంత అనేది ఉంటుంది. ఆ తర్వాత నికర బిల్లు దగ్గర సున్నా చూపిస్తుంది.

Updated On 1 March 2024 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story