గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక నుండి.. గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో అవినీతి.. అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఏసీబీకి చెప్పాలని సీఎం సూచించారు. సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో చాలా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు.

గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు రుణం ఇవ్వటం ఎందుకు ఆపేసిందో తెలపాలని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. కాగ్ కూడా వీటిపై వివిధ అభ్యంతరాలు లేవనెత్తింది. అందుకే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Updated On 5 March 2024 11:58 PM GMT
Yagnik

Yagnik

Next Story