తెలంగాణ(telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) ఆస్తి, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగింది.

తెలంగాణ(telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) ఆస్తి, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగింది. వదర బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ వి.లచ్చిరెడ్డి(P.Lachchi reddy) కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించారు. సుమారు 100 కోట్ల రూపాయల(100 crores) విరాళాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గు స‌హాయ‌క చ‌ర్య‌లను వేగ‌వంతం చేసింద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారని లచ్చిరెడ్డి గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీగానే న‌ష్టాన్ని క‌లిగిచింద‌న్నారు. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ భావించిందన్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా ప్ర‌భుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌గా నిల‌వాల‌ని భావించామ‌న్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగిందన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌మ వంతు స‌హాకారంగా ఒక రోజు వేత‌నం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లకు అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ విభాగాల‌లోని ఉద్యోగుల త‌రుపున స‌మిష్టి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వ‌ర‌ద విప‌త్తు సృష్టించిన ప్రాంతాల‌లో ప్ర‌త్య‌క్షంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో పాల్గొన‌డంతో పాటు త‌మ బాధ్య‌త‌గా ఒక రోజు వేత‌నాన్ని విరాళంగా అంద చేయ‌నున్న‌ట్టుగా లచ్చిరెడ్డి తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story