ఇకపై విద్యుత్ బిల్లులపై(ELectricity Bill) QR కోడ్ ను ముద్రించనున్నారు.

ఇకపై విద్యుత్ బిల్లులపై(ELectricity Bill) QR కోడ్ ను ముద్రించనున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ QR కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ QR కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. RBI కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నను, ప్రస్తుతానికి బిల్లు వసూళ్లపై ప్రభావం పడలేదు. ఈ రోజు ఉదయం పది గంటల వరకు దాదాపు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ వెబ్సైటు, మొబైల్ App నుండి Bill desk - PGI, Paytm - PG, TA Wallet, TG/AP Online, MeeSeva, T-Wallet, Bill desk (NACH) ద్వారా బిల్లులు చెల్లించొచ్చు. వినియోగదారులకు మరింతగా సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story