తిరుమల లడ్డూ వివాదం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికర, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.

తిరుమల లడ్డూ వివాదం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికర, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి(Congress Leader JaggaReddy) కూడా లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదం వెనుక బీజేపీ (BJP)కుట్ర ఉందని ఆయన అన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు(ChandraBabu)పనిచేస్తున్నారన్నారు. టీడీపీ(TDP)కి, వైసీపీ(YCP)మధ్య మరింత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి సానుభూతితో వచ్చే ఎన్నికల్లో సీట్లు సంపాదించుకుందామని బీజేపీ ఎత్తుగడ వేసిందన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు మరియు జగన్(YS Jagan) ఇద్దరు పూర్తిగా విఫలమయ్యారని.. ఏపీ(AP)కి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం (Polavaram)నిర్మాణం పూర్తి చేయడం రెండు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారని జోస్యం చేప్పారు.

ehatv

ehatv

Next Story