ఖమ్మం పట్టణ సమీపంలోని నాయకనిగూడెంలో దెబ్బతిన్న వంతెనను, రోడ్డును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు

ఖమ్మం పట్టణ సమీపంలోని నాయకనిగూడెంలో దెబ్బతిన్న వంతెనను, రోడ్డును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అవసరమైన మరమ్మతులను ప్లాన్ చేయండని అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉప్పొంగిన ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించారు. అలాగే పాలేరు ఎడమ కాలువను కూడా పరిశీలించారు. భారీ వరద నీరు కార‌ణంగా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను పరిశీలించారు.


వరద తాకిడికి గురైన జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ జరిగిన పరిణామాలను సీఎంకు వివరించారు. ఖమ్మం పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలో ప్రవహించే మున్నేరు నది అనూహ్యంగా ఉప్పొంగడంతో న‌గ‌రంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ విపత్తులో ప‌లువురు ప్రాణాలను కూడా కోల్పోయారు. మౌలిక సదుపాయాలు, గృహాలు, వ్యవసాయానికి విస్తృతమైన నష్టాన్ని కలిగించింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story