మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించిన ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Balakrishna reddy) కన్నుమూశారు.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించిన ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Balakrishna reddy) కన్నుమూశారు. అనారోగ్యంతో నెల రోజుల కిందట సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రిలో(Yashoda Hospital) చేరారు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన జిట్టా బాలకృష్ణ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ(TRS) ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో(KCR) కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు జిట్టా! ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయనకు రాజకీయాలు కలిసిరాలేదు. భువనగిరి శాసనసభ్యుడిగా మూడు నాలుగు సార్లు పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. బీజపీ(BJP), కాంగ్రెస్‌(Congress) పార్టీల్లోనూ జిట్టా కొంత కాలం ఉన్నారు. భువనగిరి శివారులో ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.

Eha Tv

Eha Tv

Next Story