ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న(Teenmaar-Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న(Teenmaar-Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో(Elections) తాను పోటీ చేస్తే బీసీలే(BC) ఓట్లు వేయాలని అన్నారు. రెడ్లు, ఓసీలు నాకు ఓట్లు వేయొద్దని ఎమ్మెల్సీ మల్లన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ పదవులు నాకు లెక్క కాదని.. అతి త్వరలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతుందన్నారు. బీసీలు ఓట్లు వేయకపోతే ఒక్కరు కూడా గెలవరు అని అన్నారు. తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేన‌ని వ్యాఖ్యానించారు. ఈటల రాజేంద‌ర్‌ బీసీల కోసం స్టేట్‌మెంట్‌ ఇవ్వలేరని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలదేన‌న్నారు. 2028లో బీసీనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతార‌ని మ‌ల్ల‌న్న వ్యాఖ్యానించారు.

Eha Tv

Eha Tv

Next Story