వేసవి సెలవులు త్వరలో ముగుస్తూ ఉండడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు

వేసవి సెలవులు త్వరలో ముగుస్తూ ఉండడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ఆదివారం, మే 26న ఏకంగా 30,361 మంది సందర్శకులు వచ్చారు. ఇదొక రికార్డు అధికారులు తెలిపారు. భారీగా సందర్శకుల తాకిడి ఉండడంతో జూ యాజమాన్యం అదనపు బుకింగ్ కౌంటర్లను తెరిచింది. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. సందర్శకుల తాకిడి కారణంగా అదనపు భద్రతను మోహరించారు. కార్యకలాపాలు సజావుగా జరిగేలా అన్ని విభాగాల సిబ్బందిని కీలక పాయింట్ల వద్ద ఉంచారు.

మే 19న, జంతుప్రదర్శనశాలకు 25,000 మంది సందర్శకులు వచ్చారు. మే 26న ఏకంగా 30,361 మంది సందర్శకులతో ఈ ఆదివారం నాడు గత రికార్డును బద్దలు కొట్టింది. జూని సందర్శించినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఎ నాగమణి కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 26 May 2024 9:23 AM GMT
Yagnik

Yagnik

Next Story