పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి అన్న ఇంగితం కూడా లేకుండా పోయింది ఓ కామాంధుడికి. ఆరుబయట తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన పాపాత్ముడు..

పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి అన్న ఇంగితం కూడా లేకుండా పోయింది ఓ కామాంధుడికి. ఆరుబయట తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన పాపాత్ముడు.. అభంశుభం తెలియని ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన మూర్ఖుడిని అత్యంత కఠినాత్మకమైన శిక్ష పడాలని స్థానికులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(sulthanabad) మండలం కాట్నపల్లిలోని మమతారైస్‌మిల్లులో ఈ అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. కరెంట్‌ పోవడంతో ఆరు బయట తల్లితో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం(Rape), హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో (CCTV Camera)కనిపించాయి. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్‌ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్‌, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామం. ఆరుగాలం కష్టపడి వలస వచ్చి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిపై ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని ఆ పాప తల్లి తట్టుకోలేక రోదిస్తోంది. కరెంట్‌ పోయి ఇంట్లో ఉమ్మరిస్తున్నందున బయటకొచ్చి పడుకున్నామని రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య చిన్నారిని ఎత్తుకెళ్లారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నిందితుడి కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని, ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.

Eha Tv

Eha Tv

Next Story