ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు.

ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి(Gachibouli) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కొండాపూర్‌(Kondapur) మసీదు బండ ప్రభుపాద కాలనీలో ఉంటున్న 32 ఏళ్ల అడ్డాల నరేశ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన మేనకోడలు అయిన హారిక (20)ను పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో హారికతో పాటు ఆమె తమ్ముడు ఫణీంద్ర(19) కూడా ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 20వ తేదీన హారిక(Harika), ఫణీంద్ర(Phanindra) ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. అప్పట్నుంచి తిరిగి ఇంటికి రాలేదు. తమ కోసం వెతికితే చనిపోతామని హారిక లేఖ(Letter) రాసి ఇంట్లో పెట్టింది. ఆమె భర్త నరేశ్‌ కొంతకాలం వారి గురించి చాలా చోట్లవెతికారు. హారిక తల్లిని అడిగితే తమ దగ్గరకు రాలేదని చెప్పారు. వారి జాడ తెలియకపోవడంతో మంగళవారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. అయిదు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Eha Tv

Eha Tv

Next Story