సోనియమ్మ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్ గాంధీ దేశానికి ఐదు గ్యారంటీలు ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో ఆయ‌న మాట్లాడుతూ..

సోనియమ్మ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్ గాంధీ దేశానికి ఐదు గ్యారంటీలు ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇక్కడ మిమ్మల్ని చూస్తోంటే ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది ఒకేసారి పోటెత్తినట్లుందన్నారు. మీ శ్రమ, మీ కష్టం, మీ త్యాగంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొద్దామ‌న్నారు. గుజరాత్ మోడల్ పై వైబ్రాంట్ తెలంగాణ మోడల్ ఆధిపత్య చూపడం ఖాయం.. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమ‌న్నారు.

దేశ ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి? అని ప్ర‌శ్నించారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 7లక్షల 20వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? 750 రైతులను చంపినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్ర‌శ్నించారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మోదీ.. తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. దక్షిణ భారతం, ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.

గతంలో హైదరాబాద్ వరదల్లో మునిగితే సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బొందపెట్టినట్టే.. కేంద్రంలో బీజేపీని బొంద పెట్టాలన్నారు. భాష గురించి, భావం గురించి నిన్న మొన్న కొన్ని నక్కలు మాట్లాడుతున్నాయి. పదేళ్లు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడుతున్నారు.. మా కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే మీ ఒంటిమీద అంగీ లాగు కూడా మిగలదన్నారు. కాలు విరిగిందని కొంత కాలం మేం సంయమనం పాటించామ‌న్నారు. మీరేం చేసినా మేం ఊరుకుంటామనుకోవద్దు.. చూస్తూ ఊరుకోవడానికి నేను పెద్దలు జానా రెడ్డిని కాదు.. నేను రేవంత్ రెడ్డిని.. మీకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపించడం ఖాయమ‌ని.. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టించి తీరుతామ‌ని హెచ్చ‌రించారు.

కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన చోట మీరు ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట మేం ఓట్లు అడుగుతాం.. మీకు డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దామ‌న్నారు. వంద రోజుల్లో మేం మంచి పరిపాలన అందిస్తే తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలు గెలిపించండని కోరారు. తెలంగాణ సమాజం అభివృద్ధికి, భవిష్యత్ లో నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. గంటకో డ్రస్ మార్చే మోదీ కావాలో.. ప్రజల కోసం దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కావాలో నిర్ణయించుకోండన్నారు. ఈ ఎన్నికల్లో ఈడీ, ఐటీ, సీబీఐల మోదీ కుటుంబం గెలుస్తుందో.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం గెలుస్తుందో చూద్దామ‌న్నారు.

Updated On 7 April 2024 12:23 AM GMT
Yagnik

Yagnik

Next Story