మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీదే క్రియాశీలక పాత్ర అని చేరిక‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారు.

మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీదే క్రియాశీలక పాత్ర అని చేరిక‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారు. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదని.. అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్, ఇక్కడ బీఆర్ఎస్ ది 30 శాతం కమీషన్ సర్కార్ అని ఆరోపించారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గనిపిస్తుందని అన్నారు. పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్ కు ఏమనిపించడంలేదా? అని ఎద్దేవా చేశారు. దేశమంతా ఎమ్మెల్యే చరిత్ర తెలిసినా కేసీఆర్ కు తెలియడంలేదా? అని ప్ర‌శ్నించారు. అక్కడ ఉన్నది దుర్బుద్ధి చిన్నయ్యా? దుర్గం చిన్నయ్యా? అని అడిగారు. దండుపాళ్యం ముఠా శాండ్, ల్యాండ్, మైన్ అవినీతిలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నేతలేన‌న్నారు.

నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఎస్పీఎఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉందని అన్నారు. టీఎస్పీఎఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని.. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని అన్నారు. అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను పునఃసమీక్షించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయని అన్నారు. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలన్నారు. పేపర్ లీకేజీకి కారణం మంత్రి కేటీఆర్. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

Updated On 17 Jun 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story