పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ శ్రీనివాస్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ శ్రీనివాస్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పీసీసీ మాజీ అధ్యక్షుడుగా డీ శ్రీనివాస్‌ కీలకపాత్ర పోషించారని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీనివాస్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి.. కాంగ్రెస్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని తెలిపారు.

డీ శ్రీనివాస్ కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంటులో సీనియర్ నేతను ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. ఆయ‌న ఏ పదవుల కోసం ఆశపడలేదన్నారు. ఆయన మరణానంతరం ఆయనపై కాంగ్రెస్ జెండాను కప్పాలన్న కోరిక మేరకు సీనియర్‌ నేతలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని విచారం వ్య‌క్తం చేశారు. మేము ఆయ‌న‌ కుటుంబ సభ్యులతో చ‌ర్చించి.. డీఎస్‌ జ్ఞాపకార్థం ఏమి చేయాలో చర్చిస్తామని అన్నారాయన. నివాళులర్పించిన అనంత‌రం ముఖ్యమంత్రి నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

Eha Tv

Eha Tv

Next Story