టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. అధికార బీఆర్ఎస్‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని కాంగ్రెస్ శ్రేణులను సమాయ‌త్తం చేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. అధికార బీఆర్ఎస్‌(BRS)ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని కాంగ్రెస్(Congress) శ్రేణులను సమాయ‌త్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గురువారం ఏకంగా ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. దుబ్బాక(Dubbaka), హుజూరాబాద్(Huzurabad), మానకొండూర్(Maanakonduru), మహేశ్వరం(Maheshwaram), ఎల్బీ నగర్(LB Nagar), ముషీరాబాద్(Musheerabad) నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన ప్ర‌చార‌ సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.

ఉదయం 11 గంటలకు దుబ్బాక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంత‌రం మధ్యాహ్నం 12.30 గంటలకు హుజూరాబాద్ బహిరంగ సభకు హాజ‌ర‌వుతారు. మధ్యాహ్నం 2 గంటలకు మానకొండూర్ బహిరంగ సభలో ప్ర‌సంగిస్తారు. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంత‌రం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్ కార్నర్ మీటింట్‌కు హాజ‌ర‌వుతారు. చివ‌ర‌గా సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Updated On 22 Nov 2023 10:52 PM GMT
Yagnik

Yagnik

Next Story