ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇంకా మూడు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇంకా మూడు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. రోజు నాలుగైదు స‌భ‌లు, రోడ్డు షోల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

జుక్కల్(Jukkal), షాద్ నగర్(Shadnagar), ఇబ్రహీంపట్నం(Ibrahim Patnam), కల్వకుర్తి(Kalvakurthi) నియోజకవర్గాల్లో జ‌రిగే ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జుక్కల్ బహిరంగసభకు హాజ‌రై ప్ర‌సంగిస్తారు. ఉదయం 11.30 గంటలకు షాద్ నగర్ బహిరంగసభలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇబ్రహీంపట్నం బహిరంగసభకు హాజ‌ర‌వుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి బహిరంగసభ లో పాల్గొని ప్ర‌సంగిస్తారు.

Updated On 24 Nov 2023 8:47 PM GMT
Yagnik

Yagnik

Next Story