ఎంపీ కేశవరావుకు మతి భ్ర‌మించినట్లుందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమ‌ర్శించారు. తెలంగాణ భవన్ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

ఎంపీ కేశవరావుకు మతి భ్ర‌మించినట్లుందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమ‌ర్శించారు. తెలంగాణ భవన్ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదట్నుండి తెలంగాణ బ్రతుకుల మీద విషం చిమ్ముతున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహి పార్టి అని చెప్పులతో కొట్టారని అన్నారు. మిలియన్ మార్చ్ లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలని.. ఇవ్వాళ పాట లేదు.. మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారని.. కేశవరావు భాష ఎవరికీ అర్ధం కాదన్నారు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో తెలియదు అలాంటి ఆమెకు కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చార‌ని అన్నారు. పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారని అన్నారు. కేశవరావు తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరైంది కాదన్నారు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమ‌ర్శించారు. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే కేశవరావు ఇంటి ముందు దూందాం నిర్వహిస్తామ‌ని అన్నారు. 10 ఏండ్లు ఆకలి భాధలు లేని తెలంగాణను చూశామ‌న్నారు.

కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదన్నారు. ఆమె కేసీఆర్ ని విమర్శిస్తున్నారు. కడియం శ్రీహరి ఏ బడి లో చదువుకున్నాడో.. ఎక్కడ బడి చెప్పిండో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ ద్రోహి టిడిపి నుండీ పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లోకి వస్తా అంటే కేసీఆర్ ఆహ్వానించారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి మాదిగ ద్రోహి.. మాదిగ జాతి అంటే కళ్ల మంట.. మాదిగ జాతిని మొత్తాన్ని నిర్విర్యం చేసిన ఘనత కడియం శ్రీహరిదన్నారు. కడియం శ్రీహరి వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరీ రమేష్ వెళ్ళిపోయారన్నారు. మాదిగ జాతి ఎవరు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయ్యొద్ద‌ని సూచించారు. అత్యధికంగా మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని అన్నారు. మనిషి చనిపోతే చావు డప్పు కొట్టే మాదిగలకు ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహుల పార్టీ అని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామ‌న్నారు. వరంగల్ లో కడియం శ్రీహరి పై చావు డప్పు కొడుతామ‌న్నారు. వందకు వంద శాతం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ వెంటే మేము ఉంటాం. ముసలి నక్కలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. కడియం శ్రీహరి మాదిగలకు ద్రోహం చేశాడు.. కాబట్టి కచ్చితంగా శ్రీహరిని ఒడిస్తాం.. ఓడగొట్టి పాతి పెట్టే వరకు రసమయి బాలకిషన్ కాలుకి గజ్జె కట్టి ఆడి పాడుతాడని చెప్పారు. మా పార్టీ ఆదేశిస్తే నేను వరంగల్ నుండీ పోటీ చేస్తానన్నారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్లు కొసం తాపత్రయ పడుతోంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారో మందకృష్ణ మాదిగ అన్న ఎందుకు మాట్లాడం లేదని ప్ర‌శ్నించారు.

Updated On 1 April 2024 3:07 AM GMT
Yagnik

Yagnik

Next Story