☰
✕
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి
x
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పాడెను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోశారు.
రామోజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Yagnik
Next Story