కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ అన్నారు. కామారెడ్డిలో ఆయ‌న మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణ ముఖ్య ఉద్దేశం.. నీళ్ల కోసం కాదు.. డబ్బులు దోచుకోవడం కోస‌మేన‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) లో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కామారెడ్డి(Kamareddy)లో ఆయ‌న మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణ ముఖ్య ఉద్దేశం.. నీళ్ల కోసం కాదు.. డబ్బులు దోచుకోవడం కోస‌మేన‌న్నారు. ధరణి ద్వారా భూములను లాక్కోడానికి కేసీఆర్(KCR) చూస్తున్నాడని.. దళిత బంధులో కమిషన్ ల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. పేపర్ లీక్ తో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్(Congress) ఏం చేసింది అని కేసీఆర్(KCR) ఆడుగుతున్నాడు.. కాంగ్రెస్ తెలంగాణ(Telangana) ఇచ్చింద‌న్నారు. నరేంద్ర మోదీ(Narendra Modi) ఏం మాట్లాడుతాడో.. కేసీఆర్ అదే చెపుతాడన్నారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్‌(BRS) రెండు పార్టీలు ఒకటే.. కేసీఆర్, మోదీ ఒకటే.. లేదంటే కేసీఆర్ పై ఈడీ(ED), సీబీఐ(CBI) కేసులు పెట్టేదన్నారు.

బీసీ సీఎం అంటున్నారు ముందు రెండు శాతం ఓట్లు తెచ్చుకోండని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ పని తెలంగాణలో అయిపోయిందన్నారు. అందుకే బీజేపీ.. బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుందన్నారు. పేదల నుంచి దోచుకున్న డబ్బులను తిరిగి ఇస్తామ‌న్నారు. అందుకే ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చాం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామ‌న్నారు.

Updated On 26 Nov 2023 5:56 AM GMT
Yagnik

Yagnik

Next Story