తెలంగాణలోని నల్లగొండ పట్టణంలోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారును

తెలంగాణలోని నల్లగొండ పట్టణంలోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారును ఒక బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందినట్లు తెలుస్తోంది. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. రఘుబాబుది తప్పులేదని ప్రత్యక్ష సాక్షి చెబుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది.

నార్కట్‌పల్లి -అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ నల్గొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దనరావు(48) అక్కడి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం జనార్దనరావు వాకింగ్ కోసం సమీప లెప్రసీ కాలనీలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి బైక్‌పై బయలుదేరారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

Updated On 17 April 2024 9:05 PM GMT
Yagnik

Yagnik

Next Story