సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

సాధించుకున్న తెలంగాణ(Telangana) తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు(Paleru) కాంగ్రెస్(Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఖమ్మం రూరల్(Khammam Rural) మండలం ఎన్నికల ప్రచారంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దొర ఫామ్ హౌస్(Farm House) నుంచి బయటికి వస్తాడని.. ఎన్నికలు అయిపోతే సామాన్య ప్రజానీకం కష్టాలల్లో ఏనాడు పాలుపంచుకోడని విమ‌ర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఇంద్రలోకం చంద్రలోకం చూపించి మాయ మాటలు చెబుతాడని ఎద్దేవా చేశారు. ఈ దొర మాయమాటలకు మోసపోతే మళ్ళీ మనం గోస పాలవుతామ‌న్నారు.

ఇందిరమ్మ రాజ్యంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందామ‌న్నారు. నిత్యం మీతోనే ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాన‌ని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి మీ శీనన్న ని అత్యధిక మెజార్టీతో గెలిపించండని అభ్య‌ర్ధించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ఇప్పటివరకూ ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడని ఆరోపించారు. దోచుకొని దాచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని.. ఇక్కడ నన్ను ఓడించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నాడని అన్నారు.

ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజల కోసం బాధపడుతున్నట్లు కన్నీరు కార్చుతున్నారు.. ఒక వ్యక్తి కన్నీరు పెడుతున్నాడని ఆలోచిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మనం ఆ కన్నీళ్లు భరించాల్సి వస్తుందన్నారు. మీరు ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్ ని ఎండగడుతున్న.. రేపు అసెంబ్లీలో తప్పకుండా అధికారపక్షంలో నేను.. ప్రతిపక్షంలో కేసీఆర్ ఉంటాడని జోస్యం చెప్పారు. అసెంబ్లీలో ప్రతిరోజు చేసిన తప్పులను నిగ్గదీసే కార్యక్రమం ఉంటుంద‌న్నారు.

Updated On 23 Nov 2023 8:56 AM GMT
Yagnik

Yagnik

Next Story