రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు ఈరోజు రోడ్డెక్కారు.

శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల(Political leaders) ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు ఈరోజు రోడ్డెక్కారు.

వరంగల్ జిల్లా(Warangal) మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆందోళన బాటపట్టారు. కానిస్టేబుళ్లతో వెట్టిచాకిరి చేపిస్తూ, కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా. కుటుంబానికి దూరం చేస్తున్నారని పోలీస్ భార్యలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కానిస్టేబుళ్ల‌ భార్యలు ఈరోజు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవో ఆఫీస్ నుంచి మామునూరు బెటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. జర్వ్డ్‌ పోలీసుల బాధ లను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కొత్త డీజీ రావడం తోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పోలీసుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story