బోధన్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌(TRS) నేత షకీల్‌పై(Shakil) కేసు నమోదయింది. గత నెలలో ప్రజాభవన్(Praja bhavan) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడు సోహెల్‌ను(sohel) దుబాయ్‌కు పంపించడంలో షకీల్ పాత్ర ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. సోహెల్ దుబాయ్(Dubai) పారిపోయేందుకు పది మంది సహకరించారని పోలీసులు గుర్తించారు. పది మందిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌(TRS) నేత షకీల్‌పై(Shakil) కేసు నమోదయింది. గత నెలలో ప్రజాభవన్(Praja bhavan) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడు సోహెల్‌ను(sohel) దుబాయ్‌కు పంపించడంలో షకీల్ పాత్ర ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. సోహెల్ దుబాయ్(Dubai) పారిపోయేందుకు పది మంది సహకరించారని పోలీసులు గుర్తించారు. పది మందిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉన్న సోహెల్‌ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సోహెల్‌పై లుకౌట్‌ సర్క్యులర్‌ను అధికారులు జారీ చేశారు. సోహెల్‌ను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు.

ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24న రాత్రి అతి వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ(BMW) కారు బ్యారికేడ్లను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ వాహనం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌దనిని పోలీసులు చెప్తున్నారు. అందరూ విద్యార్థులేనని కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని పోలీసులు నిర్ధారించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Updated On 17 Jan 2024 4:09 AM GMT
Ehatv

Ehatv

Next Story