బుధవారం శ్రీ రామనవమి సందర్భంగా ఊరేగింపు కోసం బీజేపీ ఎమ్మెల్యే

బుధవారం శ్రీ రామనవమి సందర్భంగా ఊరేగింపు కోసం బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌కు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని.. అయితే దాన్ని తిరస్కరించినట్లు పోలీసులు తెలిపారు. రాజా సింగ్ ఫిబ్రవరి 14న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు దరఖాస్తు చేశారు. సీతారాంబాగ్ ఆలయం నుండి ఇతర ప్రధాన ఊరేగింపును యథావిధిగా శ్రీరామ నవమి శోభా యాత్రా కమిటీ బయటకు తీసుకువెళుతుంది.

పోలీసుల నిర్ణయంపై రాజా సింగ్ స్పందించారు. 2010 నుంచి తాను శ్రీరామనవమి శోభా యాత్రను చేపడుతున్నానని.. ఈ ఏడాది మాత్రమే పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ పండుగలపై ఆంక్షలు ఉంటాయని భావించారు. ఇది కర్ణాటకతోపాటు ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగింది" అని రాజ్ సింగ్ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆకాశ్‌పురి హనుమాన్‌ దేవాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, ఎవరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే అన్నారు.

Updated On 16 April 2024 8:57 PM GMT
Yagnik

Yagnik

Next Story